Monday, December 26, 2011
ఇదీ ఈనాడు మార్కు ఎల్లో జర్నలిజం...
BY MISSIONTELANGANA – JULY 27, 2011
POSTED IN: MEDIA WATCH, OPINION
నిన్న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటన ఇది:
“This is a unique situation where political parties in Andhra Pradesh are divided down the middle. Congress, Telugu Desam, CPI, CPI(M) are all divided. The only party which claims to be undivided is BJP because it has only one member”
ఆ ప్రకటనను ఈనాడు పత్రిక ఇవ్వాళ పతాక శీర్షికలో వేసింది. ఒక సారి చదవండి:
–
”తెలంగాణ అంశంపై అసాధారణ స్థాయిలో రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశంలు నిట్టనిలువునా చీలిపోయాయి. చీలిపోలేదని చెప్పుకుంటున్న భాజపాకి ఉన్నది.. ఇద్దరే సభ్యులు. తెరాస, సీపీఐలు తెలంగాణకు పూర్తి అనుకూలం. ఈ స్థితిలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలపై ఏదో ఒక పరిష్కారాన్ని బలవంతంగా రుద్దలేం” అని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు.”
–
ఏదో తేడా ఉన్నట్టుంది కదూ. అదే మరి ఈనాడు చేసే పదాల కనికట్టు…
తెలంగాణపై సీమాంధ్ర మీడియా చేసే దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇందులో TV9 వంటివి బహిరంగంగానే విషం చిమ్మితే ఈనాడు వంటివి చాలా తెలివిగా తెలంగాణ గురించి దుష్ప్రచారం చేస్తాయి.
నిన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటన తప్పుల తడక. వేరే పత్రికలన్నీ దాన్ని యధాతదంగా ప్రచురిస్తే ఈనాడు మాత్రం అందులోని తప్పులన్నీ దిద్దింది.
హోం మంత్రి ప్రకటనలో ఎన్ని తప్పులున్నాయో ఇక్కడ చదవండి: http://missiontelangana.com/?p=1997
విలేకరుల సమావేశమయితే ఏ పత్రిక ఇష్టం వచ్చినట్టు అది రాసుకోవచ్చు. కానీ నిన్నటి చిదంబరం ప్రకటన పీటీఐ వార్తాసంస్థ పంపించిన ఫీడ్. కాబట్టి అన్ని పత్రికలూ పీటీఐ వాళ్లు పంపినదే యధాతదంగా ప్రచురించాలి.
కానీ ఉన్నదున్నట్టు ప్రచురిస్తే తెలంగాణపై చిదంబరం బాద్యతారాహిత్యం ఎక్కడ బయటపడిపోద్దో అని ఈనాడు వారు దాన్ని సరిదిద్దారు.
ఇదీ ఈనాడు మార్కు తెలంగాణ వ్యతిరేక ఎల్లో జర్నలిజం.
అందుకే సీమాంధ్ర మీడియాను తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తున్నారు
–
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment